Posts

పిల్లల ప్రాణాలతో చెలగాటమా.. జన్మభూమి పార్కులో ప్రమాదకర ఆట పరికరాలు

Image
కాకినాడ  : నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన జన్మభూమి పార్కులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలు ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. పిల్లలు ఎక్కువగా వినియోగించే జారుడు బల్లలు, ఊయలలు తుప్పుపట్టి, కొన్ని చోట్ల ఇనుప షీట్లు చిల్లు పడిన స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కులోని ఓ జారుడు బల్ల  పైన భాగంలో పెద్ద రంధ్రం ఏర్పడగా, మరో ఆట పరికరం పైభాగం పూర్తిగా తుప్పుపట్టి బలహీనంగా కనిపిస్తోంది. ఊయలల గొలుసులు, సీట్లు కూడా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ వందలాది మంది చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి పార్కుకు వస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో పరికరాలు విరిగిపోతే తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "పిల్లలను పార్కుకు తీసుకొస్తే ఆనందంగా ఆడుకోవాల్సింది పోయి, ఏ పరికరం ఎప్పుడు విరిగిపోతుందోనన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా చూడాల్సి వస్తోంది. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే మరమ్మతులు...

మరణించిన కార్యకర్త కుటుంబానికి టీడీపీ అండ.. బాబి నాయకత్వంలో 5 లక్షల బీమా క్లెయిమ్

Image
కాకినాడ రూరల్ నియోజకవర్గం : తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్త కుటుంబానికి పార్టీ అధిష్టానం భరోసాగా నిలిచింది. కరప మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త త్రిమూర్తులు మేనవల్లి అకాల మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి సభ్యత్వ బీమా ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఈ మొత్తాన్ని మృతుడి నామినీ వీరరాఘవలు మేనవల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గ కో-కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను ఎన్నటికీ మరచిపోమని, వారి కుటుంబాలకు అండగా నిలవడం తెలుగుదేశం పార్టీ బాధ్యత అని బాబి పేర్కొన్నారు. కష్టకాలంలో ఈ బీమా సొమ్ము కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, వారి సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. బీమా క్లెయిమ్ సకాలంలో అందడంతో బాధిత కుటుంబ సభ్యులు పార్టీ అధిష్టానానికి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, కటకంశెట్టి బాబికి కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్..

Image
విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొని తన బృందంతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  సమాచారం ప్రకారం, ప్రయాణం మధ్యలో టీమ్‌లోని ఓ సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో రోడ్డుపక్కన కారును ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కారు నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ నిలిచి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో పండు మాస్టర్‌కు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.  ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహచరులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం కారణమా లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.  తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్‌తో గుర్తింపు పొందిన పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ మరియు టెలివిజన్ రంగ ప్రముఖులు సోషల్ మీడియాలో...

పులి పంజా.. 13 లేగదూడల బలి

Image
దేవీపట్నం : అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పులి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన పులి దాడిలో 13 లేగదూడలు మృతి చెందాయి. ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పులి కదలికలను గుర్తించి పట్టుకునేందుకు 6 ర్యాపిడ్ రెస్క్యూ బృందాలు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్విలైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, ఒక కేజ్ బృందం, ఒక వన్యప్రాణి అంబులెన్స్ బృందంతో పాటు 19 హనుమాన్ బృందాలను రంగంలోకి దింపారు. మొత్తం సుమారు 100 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్. నాగేశ్వరరావు, రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డీఎఫ్‌ఓ ఎన్. రామచంద్రరావు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పశువులను కోల్పోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు ప్రజల భద్రత దృష్ట్యా పోతవరం–దండంగి రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి దిగ్బంధం చేశారు. పులి సంచార...

కూటమి నేతలైనా వదిలేది లేదు.. పన్ను ఎగవేతదారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

Image
అమరావతి :  నెలకు రూ.10 వేల సంపాదించే సాధారణ ఉద్యోగిపై పన్నుల భారం మోపుతున్నామని, కానీ కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ భారీ ఆదాయాలు ఆర్జిస్తున్న వారి వద్ద నుంచి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయడంలో వ్యవస్థ విఫలమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పన్నుల విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండకూడదని, అది కూటమి పార్టీల నాయకులైనా, అధికార పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసే పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలపై అదనపు భారం మోపడం కంటే భారీ స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దాచిపెడుతున్న వారిని గుర్తించి వసూళ్లు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి రూపాయి కీలకమని, ప్రజల సొమ్మును కాపాడటంలో ప్రభుత్వం రాజీపడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

Image
కాకినాడ : సత్య చారిటబుల్ ట్రస్ట్, సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం జూన్ 7న స్కాలర్‌షిప్ మెరిట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ తెలిపారు. పదో తరగతిలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్ష కేంద్రాల వివరాలను పరీక్షకు రెండు రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. మొత్తం 60 బహుళ ఎంపిక ప్రశ్నలతో 140 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. గణితంలో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సైన్స్‌లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సాంఘిక శాస్త్రం మరియు సాధారణ జ్ఞానంలో 20 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష 10వ తరగతి సిలబస్‌తో పాటు సాధారణ జ్ఞానం ఆధారంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ముఖ్యమైన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప...

ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

Image
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీ (IIIT)లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును అధికారులు రేపటి వరకు పొడిగించారు. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా, ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కోటా కింద అదనంగా 10 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల రెండో వారంలో ప్రవేశ ఫలితాలను విడుదల చేసి, మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.